Sunday, April 28, 2024

హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో శనివారం మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో పైవంతెన ప్రారంభం కానుంది. రెండో స్థాయిపై వంతెనను సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్‌తో ఎల్బీ నగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. రూ. 148.5 కోట్లతో బైరామల్ గూడ కూడలి వద్ద పై వంతెనను నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ శంషాబాద్, ఓవైసీ ఆస్పత్రి నుంచి బిఎన్ రెడ్డి నగర్, సాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుంట చెక్ పోస్టు అండర్ పాస్ నుంచి హయత్ నగర్ వెళ్లే వాహనాలకు ఉపయోగపడుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News