Sunday, April 28, 2024

స్వల్పంగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ధరల మోతతో ఇబ్బందులు పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు కంపెనీలు కాస్త ఉపశమనం కల్పించాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి.19 కెజిల సిలిండర్‌పై రూ.39.50లు తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. తగ్గించిన ధరలు ఈ రోజునుంచే అమలులోకి వచ్చినట్లు తెలిపాయి. ధరలు తగ్గిన తర్వాత దేశ రాజధానిలో రూ.1,796.50 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,757కు తగ్గింది. ముంబయిలో రూ. 1,710, కోల్‌కతాలో రూ.1,868.50, చెన్నైలో రూ.1,929కి స్వల్పంగా తగ్గాయి. కాగా గృహ అవసరాలకు ఉపయోగించే14 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పూ లేదు. మరో వైపు గత 21 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News