Sunday, May 5, 2024

రేపు కాళేశ్వరం పర్యటనకు కాంగ్రెస్ ఎంఎల్ఎలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంగళవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, సిఎం రేవంత్ రెడ్డి, తదితరలు కాళేశ్వరంలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే రేపు ఉదయం 9.30కి సిఎం రేవంత్‌, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూడు బస్సులలో మేడిగడ్డకు బయల్దేరనున్నారు. ప్రజా ప్రతినిధుల బృందం రేపు మధ్యాహ్నం 3గంటలకు కాళేశ్వరం చేరుకోనున్నారు. ప్రజాప్రతినిధులు రెండు గంటలపాటు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రజాప్రతినిధుల బృందం తిరిగి హైదరాబాద్‌కు రానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News