- Advertisement -
మన తెలంగాణ/ ఆసిఫాబాద్ ప్రతినిధి: జిల్లాలోని సిర్పూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి శ్రీనివాస్ను పార్టీ నుండి ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం హైదరాబాద్లో టీపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఓ సమావేశంలో అప్పటి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీకి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలపై డిసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు గతంలో అధిష్టానికి ఫిర్యాదు చేయడంతో దానిపై విచారణ జరిపి, అది నిజం కావడంతో సస్పెండ్ చేసినట్లు పేర్కోన్నారు.
- Advertisement -