Tuesday, October 22, 2024

అందుబాటులో పత్తి విత్తనాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం వ్యవసాయ,ఉద్యాన , మార్కెటింగ్, కోఆపరేటివ్ సంబంధిత కార్పోరేషన్ ల రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు అవరమైన కార్యచరణకు సంబంధించి చేపట్టిన కార్యక్రమాలను మంత్రికి వివరించారు. వ్యవసాయశాఖలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ గురించి వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరిత మంత్రికి వివరి స్తూ, 61.15 కోట్లు విలువగల 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలు రైతులకు అందచేసామని, ఇంకా అవసరమున్న మేరకు విత్తనాలు తెప్పించి ఇస్తున్నామని తెలియజేసారు. అదేవిధంగా గతేడాది 15 జూన్ నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచగా, ఈ సంవత్సరం 1,02,45,888 ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతులు ఇప్పటికే 62 లక్షల ప్యాకేట్లు కొనుగోలు చేశారని తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలోనే ఆదేశించిన విధంగా ప్రతివిత్తన కంపెనీలు రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చిన హామీమేరకు విత్తన ప్యాకెట్లు సరఫరా చేసారా, లేదా, ఆ ప్యాకేట్లు అన్ని రైతులకు చేరాయా లేదా కూడా తనిఖీ చేయాలని ఆదేశించారు.

ఎరువుల లభ్యతపై డైరెక్టర్ గోపి మాట్లాడుతూ, జూన్, జులై నెలల అవసరాలమేరకు అన్ని ఎరువులు తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. 7,97,194 మెట్రిక్ టన్నుల యూరియా, 75,278 మెట్రిక్ టన్ను డై ఆమోనియం ఫాస్పేట్, 4,27,057 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,396 మెట్రిక్ టన్నుల మ్యూరెట్ ఆఫ్ పోటాష్ ఎరువులు అంటులో ఉన్నాయని తెలుపగా, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతు రాష్ట్రానికి అవసరమేర ఎరువులు రెండు నెలల ముందుగానే తెప్పించేవిధంగా ప్రణాళిక సిద్దం చేసుకోవాల్సిందిగా అధికారులను మంత్రిగారు ఆదేశించారు.అదేవిధంగా పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఎటువంటి లోపాలకు తావులేకుండా జరగాలని ఆదేశించారు.ఉద్యానశాఖ శాఖకు సంబంధించి ఆ శాఖ డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ఆయిల్ పాంల కంపెనీల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నిర్ధేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని కంపెనీలకు నోటిసులు ఇచ్చామని తెలియజేయగా, అటువంటి కంపెనీలపై వెంటనే చట్టప్రకారం తగుచర్యలు తీసుకోవల్సిందిగా మంత్రి సూచించారు. అదేవిధంగా డ్రిప్ , స్ప్రింక్లర్స్ సౌకర్యం కేవలం ఆయిల్ పాం పంటకే కాకుండా ఇతర పంటలకు వర్తింపచేసేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని, దానికనుగుణంగా ప్రణాళికలు చేసుకోవల్సిందిగా సూచించారు.

అదేవిధంగా వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ , ఇతరశాఖల ఆధీనములో ఉన్న ప్రభుత్వ భూములను దేనికోసమైతే కేటాయించాలో, ఆ లక్ష్యాలు నేరవేర్చేవిధంగా ఉపయోగంలోకి తీసుకువ్చి, రైతులకు ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. ముఖ్యంగా విత్తనోత్పత్తిక్షేత్రాలలో విత్తనోత్పత్తి, ప్రభుత్వ నర్సరీలలో పూలు , పండ్ల మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన విత్తనాలను, మొక్కలను సరఫరా చేసేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మార్కెటింగ్ , గిడ్డంగుల అధికారులు, మార్క్ ఫెడ్ అధికారులతో సమీక్షిస్తూ, గతంలో సూచించిన విధంగా సౌరవిద్యుత్ యూనిట్లను నెలకొల్పె అవకాశాలపై సంస్థల వారిగా ప్రగతిని మంత్రి ఆరాతీశారు. పహడిషరీఫ్ లో వక్ఫ్ భూములలో ఏర్పాటుచేసిన తాత్కలిక షెడ్లలో సబ్ మార్కెట్ ప్రారంభించేందుకు అవకాశాలను పరిశీలించాల్సిందిగా మార్కెటింగ్ సంచాలకులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు , హాకా ఇంఛార్జి మేనేజింగ్ డైరెక్టర్ సత్యశారద , ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ రాములు , వేర్ హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ జితేందర్ రెడ్డి , మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News