Thursday, May 2, 2024

తీహార్ జైల్లో కవితను ప్రశ్నించనున్న సిబిఐ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితను ప్రశ్నిస్తామంటూ సిబిఐ రంగంలోకి దిగింది. తమకు అనుమతి కావాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్‌ను విచారణ జరిపిన కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటరాగేట్ చేయడానికి లేదా స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి అనుమతి కావాలని సిబిఐ ఆ పిటిషన్‌లో వెల్లడించింది. అయితే విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి కోర్టు సూచించింది. మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారించాలని ఆదేశించింది. దీంతో తీహార్ జైలులోనే కవితను సిబిఐ విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి 100 కోట్ల ముడుపులు ముట్ట జెప్పటంపై కవితను సిబిఐ విచారించనుంది. మరోవైపు బుచ్చిబాబు ఫోన్‌లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా విచారించనుంది. భూముల కొనుగోలు విషయంలోనూ విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అవినీతిపై సిబిఐ కేసు, మనీలాండరింగ్‌పై ఇడి కేసులు నమోదయ్యాయి. సిబిఐ గతంలో కవిత ఇంటికి వచ్చి స్టేట్ మెంట్ రికార్డు చేసుకుంది.

సుదీర్ఘ విరామం తర్వాత ఫిబ్రవరి 26న తమ ఎదుట హాజరు కావాలని సమన్లు పంపింది. కానీ కవిత తాను బిజీగా ఉన్నానని, తన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉందన్న కారణాలతో హాజరు కాలేదు. 2022 జులై తర్వాత లిక్కర్ స్కాం వెలుగులోకి రాగా దాదాపు ఐదు నెలల తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో తొలి సారి సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసింది. 2022, డిసెంబర్ 11న తొలిసారి సిబిఐ కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో విచారిం చింది. సిఆర్‌పిసి 160 ప్రకారం సాక్షిగా సుమారు ఏడు గంటలకు పైగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తర్వాత సిఆర్‌పిసి 91 కింద ఈ కేసుకు సంబంధించిన ఏవైనా ఆధారాలు ఉంటే సమర్పిం చాలని కోరుతూ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత సిబిఐ నోటీసులు ఇచ్చినా కవిత హాజరు కాలేదు. కోర్టులో ఉన్న తన పిటిషన్‌ను కారణంగా చూపించారు. అయితే సిబిఐ అరెస్టు చేయలేదు. ఇడి అరెస్టు చేయడంతో పాటు జైల్లో ఉండటంతో ప్రశ్నించేందుకు అనుమతి కోసం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇడి అరెస్టు చేయక ముందే ఆమె ఢిల్లీలో పలమార్లు విచారణకు హాజరయ్యారు. మూడు సార్లు 28 గంటల పాటు విచారణకు హాజరైన కవిత నుంచి ఇడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం, సౌత్ గ్రూపు ఏర్పాటు, సౌత్ గ్రూప్- ఆప్ మధ్య జరిగిన వ్యవహారాలు, ఒప్పందాలు, సౌత్ గ్రూపులో కవిత పాత్ర, పెట్టిన పెట్టుబడులు, ముడుపులుగా ఇచ్చిన డబ్బులు, స్కాంలో భాగస్వాము లైన నిందితులతో జరిపిన సమావేశాల గురించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై కవిత ఇచ్చిన సమాధానాలతో రూపొందించిన పత్రాలపై సంతకాలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడూ నోటీసులు జారీ చేయలేదు. నేరు గా సోదాలకు వచ్చి, అరెస్టు చేసింది. కవిత తన కుమా రుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించారు. ఆ పిటి షన్‌పై గురువారం విచారణ పూర్తి అయింది. తీర్పు రిజర్వ్ చేశారు. సోమవారం న్యాయమూర్తి తీర్పు ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News