Wednesday, May 1, 2024

ఇది మాట తప్పి.. మడమతిప్పటం కాదా?: రామకృష్ణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: పోలవరంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాట ఆపాలని సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్మాణానికి నిధులు, విభజన హామీల అమలుపై మోడీ ప్రభుత్వాన్ని సిఎం జగన్ ఎందుకు ప్రశ్నించడంలేదని ధ్వజమెత్తారు. 20 మంది ఎంపిలనిస్తే కేంద్రం మెడలు వంచడమంటే ఇదేనా? అని చురకలంటించారు. ఇది మాట తప్పి.. మడమతిప్పటం కాదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అఖిలపక్షాలను, ప్రజాసంఘాలను కలుపుకొని కేంద్రంపై పోరుకు సిఎం జగన్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Also Read: బిఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు: హరీశ్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News