మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ మోత్కూరు పట్టణ కమిటీ ఆద్వర్యంలో గురువారం మున్సిపల్ కమీషనర్ సతీష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంధర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రెండవ వార్డలో రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద పుల్కరం మల్లేష్ ఇంటివద్ద మురికి కాల్వ నిర్మాణం సగంలో నిలిచిపోయిందని దీంతో మురిక నీరు వచ్చి చేరి దుర్వాసన రావడంతోపాటు నీటి మడుగు ఏర్పడిందని అక్కడే మంచి నీరు సరఫరా చేసే బోరు ఉందని మురికి నీరు బోరులోకి వెళ్ళి పైపుల ద్వారా ట్యాంకులోకి చేరి ఇండ్లకు అదే నీరు సరఫరా జరిగే అవకాశం ఉందని అన్నారు.
సుందరయ్య కాలనీలో నూతనంగా నిర్మించిన మురికి కాల్వలు సక్రమంగా నిర్మించలేదని, నిర్మించిన వాటికి వాటర్ క్యూరింగ్ సరిగ్గా చేయడం లేదన్నారు. పలు వార్డులలో వీధి లైట్లు వెలగడం లేదని మున్సిపాలిటీలోని వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు అన్నెపు వెంకట్, బోయిని ఉప్పలయ్య, గీతాపని వారల సంఘం జిల్లా అద్యక్షుడు చాపల అంజయ్య, నాయకులు పుల్కర మల్లేష్, తాడూరు లక్ష్మీనర్సయ్య, గొలుసుల యాదగిరి, పోచం కన్నయ్య, పెండెం వెంకటేశ్వర్లు, ఎడ్ల ఆనందు, నిలిగొండ అశోక్, పంగ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.