Thursday, March 28, 2024

59 మంది పిల్లల అక్రమ రవాణా: కాపాడిన ఆర్‌పిఎఫ్

- Advertisement -
- Advertisement -

ముంబై : రైలులో అక్రమంగా తరలిస్తున్న 59 మంది పిల్లలను ఆర్‌పిఎఫ్ సిబ్బంది, పోలీస్‌లు కాపాడ గలిగారు. దీనికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేశారు. బీహార్‌కు చెందిన 59 మంది పిల్లలను దానాపూర్ పుణె ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో ఒక ఎన్జీవో సంస్థ సిబ్బంది, పోలీసులు, ఆర్పీఫ్ సిబ్బంది రంగం లోకి దిగారు. బుధవారం ఉదయం ఆ రైలు బుసాపల్ స్టేషన్‌కు చేరగానే అన్ని కంపార్ట్‌మెంట్లు తనిఖీ చేసి మొదట 29 మంది పిల్లలను రక్షించారు. ఆ తరువాత ఆ రైలు మన్మాడ్ స్టేషన్‌కు చేరగా మరో30 మంది పిల్లలను కాపాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News