Saturday, April 27, 2024

ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులే టార్గెట్

- Advertisement -
- Advertisement -

ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులపై సైబర్ నేరస్థులు నజర్ పెట్టారు. వారి డాటా సేకరించి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో సైబర్ నేరస్థులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని టిస్‌ఆర్‌టిసి ఎండి, సీనియర్ ఐపిఎస్ అధికారి విసి సజ్జనార్ కోరారు. ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతుండడంతో సీనియర్ పోలీస్ అధికారి, అడిషనల్ డిజి విసి సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరో విషయం గురించి చెప్పారు. సైబర్ నేరస్థులు పోలీసుల పేరు చెప్పి ప్రైవేట్ బ్యాంక్‌లో ఖాతారులను టార్గెట్‌గా చేసుకుని బెదిరిస్తున్నారని తెలిపారు.

ఐసిఐసిఐ బ్యాంక్, యాస్ బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు నకిలీ పోలీసులు ఫోన్లు చేసి బెదిరించి అందినకాడికి దోచుకుని నిండాముందుతున్నారు. సోషల్ మీడియా సాయంతో బ్యాంక్ ఏజెంట్లను నియమించుకుని, బ్యాంకు ఖాతాల్లో ఎక్కువగా డబ్బున్న వారికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అక్రమ లావాదేవీలు చేస్తూ ఇండియన్ బ్యాంక్ ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలి.

విదేశీ వ్యవహారాలపై అప్రమత్తం…
ఖాతాదారులు భారీ మొత్తంలో నగదు బదిలీకి బ్యాంకు కరెంట్ ఖాతాలను ఉపయోగించుకోవాలి. అవసరమైతేనే ఒక్కటి రెండు సార్లు ధృవీకరించుకున్నాకే కార్పొరేట్ లాగిన్‌లు తెరవాలి. కార్పొరేట్ లాగిన్‌ల సాయంతో పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ చేసే అవకాశముంది. కార్పొరేట్ బ్యాంక్ క్రెడెన్షియల్స్‌ను ఎవరికీ చెప్పవద్దు. విదేశాల నుండి ఇండియా బ్యాంక్ ఖాతాలకు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పూర్తిగా నిషేధించాలి. చైనా, హాంకాంగ్, తైవాన్, థాయిలాండ్, కంబోడియా దేశాల ఐపీ అడ్రస్‌లను బ్లాక్ చేయాలి.దుబాయ్ కేంద్రంగా డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి, దుబాయ్‌లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఫోన్లు చేస్తు మోసం చేస్తున్నారు. టెలిగ్రామ్ ద్వారా భారతీయులను రిక్రూట్ చేసుకుని, వారి సాయంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు.

తైవాన్, థాయిలాండ్, కంబోడియా దేశాల నుంచి డ్రగ్ పార్సిల్ నేరాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో ప్రపంచంలో జరుగుతున్న మొత్తం మోసాల్లో 90 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయి. అజ్ఞాత వ్యక్తులు ఫోన్లు చేస్తే స్పందించవద్దని పోలీసులు కోరారు. పోలీసులమని అని చెప్పగానే భయపడి పోయి వారు చెప్పినట్లు చెయొద్దని తెలిపారు. నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చెయొద్దు, ఒకవేళ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News