రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇటీవల రెండు డీఏలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం ఒక డీఏ ఇచ్చిన ప్రభుత్వం, మరో ఆరు నెలల తర్వాత మరో డీఏ అందించనుంది. కాగా ఉద్యోగులకు ప్రకటించిన ఒక డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి
ప్రతి నెలా సగటున సుమారు రూ.200 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.2,400 కోట్ల అదనపు భారం ఖజానాపై పడనుందని ఆర్థికశాఖ వర్గాలు లెక్కలు వేశాయి. ఓ వైపు పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చూస్తూనే మరోవైపు ఉద్యోగుల సంక్షేమానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటినుంచి ప్రతినెలా రూ.700 కోట్లను రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం ఐదు డీఏలు పెండింగ్లో ఉండగా అందులో ఇకటి ఇవ్వడానికి సిద్ధమైంది. మరో నాలుగు డిఏలు పెండింగ్లో ఉండనున్నాయి.