Saturday, July 27, 2024

చనిపోయాడనుకొని అంత్యక్రియలు… ఏడాది తరువాత తిరిగొచ్చి భార్యను పెళ్లి చేసుకున్నాడు

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఇంట్లో కుటుంబ సభ్యుడు చనిపోయాడని అంత్య క్రియలు చేయడంతో ప్రథమ వర్థంతి వేడుకలు కూడా జరిపారు. సంవత్సరం తరువాత అతడు తిరిగిరావడంతో భార్యను అతడు మళ్లీ పెళ్లి చేసుకున్న సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నవీన్ చంద్ర భట్(42) అనే వ్యక్తి సంవత్సరం క్రితం అదృశ్యమయ్యాడు.

చంపావాట్ ప్రాంతం బంబసాలో ఓ మృతదేహం కనిపించడంతో తన నవీన్ చంద్ర భట్‌దని గురించి వెంటనే కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సంవత్సరం తరువాత ప్రథమ వర్థంతి వేడుకలు కూడా జరిపారు. నవీన్ చంద్ర భట్ ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. వెంటనే మళ్లీ భార్యను పెళ్లి చేసుకున్నాడు.
ఇలాంటి సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరొకటి గతంలో జరిగింది. 2019 కోవిడ్ సెకండ్ వేవ్‌లో కమలేష్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. కమలేష్‌కు ఓ గ్యాంగ్ మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కనిపించకుండా పోయాడు. అతడి ఆచూకీ లేకపోవడంతో కరోనాతో చనిపోయాడని కుటుంబ సభ్యులు భావించి అంత్యక్రియుల జరిపారు. కమలేష్ రెండు సంవత్సరాలు తరువాత ఇంటికి వచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News