Monday, June 23, 2025

అతనిపై నమ్మకం లేకుంటే.. ఎందుకు ఆడిస్తున్నారు: దినేశ్ కార్తీక్

- Advertisement -
- Advertisement -

లీడ్స్: హెడ్డింగ్లే వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 465 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో భారత్ 6 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌ బౌలింగ్‌లో శార్ధూల్ ఠాకూర్‌కి కేవలం ఆరు ఓవర్లు మాత్రమే ఇచ్చారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) ప్రశ్నించారు.

శార్ధూల్‌పై నమ్మకం లేకుంటే అతన్ని జట్టులో ఎందుకు అడిస్తున్నారని అడిగారు కార్తీక్ (Dinesh Karthik). జట్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉంటే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని అని సూచించారు. ‘శార్ధూల్ అద్భుతంగా బౌలింగ్ చేయడం లేదు. కానీ, ఆరు ఓవర్లు మాత్రమే అతనికి ఇవ్వడం మాత్రం సరైన నిర్ణయం కాదు. ఈ విషయంలో నాకు బాధగా ఉంది. మరి కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఏం ఆలోచించాడో నేను ఊహించగలను. ఇతర బౌలర్లతో బౌలింగ్ చేయించి ఇంగ్లండ్ జట్టుపై ఒత్తిడి తేవాలని అతను అనుకొని ఉంటాడు’ అని కార్తీక్ అన్నారు.

కాగా, ప్రస్తుతం మ్యాచ్‌లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. స్వల్పస్కోర్‌కే మూడు వికెట్లు కోల్పోవడంతో కెఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తొలుత కెఎల్ రాహుల్ సెంచరీ చేయగా.. ఆ తర్వాత పంత్‌ కూడా మూడంకెల స్కోర్‌ని చేరాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో అతను సెంచరీలు సాధించాడు. ఇక స్కోర్ విషయానికొస్తే.. 70 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసి 260 పరుగుల ఆధిక్యంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News