- Advertisement -
హైదరాబాద్: గత ప్రభుత్వం రెండుపడకల గదుల ఇళ్లు ఇస్తామని పదేళ్ల పాటు మభ్య పెట్టిందని తెలంగాణ మంత్రి సీతక్క (Sitakka) మండిపడ్డారు. ప్రతి పేదవాడు కూడు, గుడ్డ, నీడ కోరుకుంటారని అన్నారు. ములుగు జిల్లా- ఇంచర్ల లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ (Distribution grant documents) కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పాల్లొన్నారు. ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఒకేసారి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందని తెలియజేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఏడాదికి కనీసం వెయ్యి ఇళ్లు కూడా నిర్మించలేదని, నిర్మించిన ఇళ్లకు కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని విమర్శించారు.
- Advertisement -