Thursday, April 25, 2024

లబ్దిదారులకు కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ పంపిణీ

- Advertisement -
- Advertisement -

Distribution of Kalyana Lakshmi checks to the beneficiaries

వ‌రంగ‌ల్ : వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎంఎల్ ఎ క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎంఎల్ ఎ అరూరి రమేశ్‌తో కలిసి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ను అంద‌జేశారు. వర్ధన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 145 మంది లబ్దిదారులకు రూ. 1, 45,16, 820 కళ్యాణ లక్ష్మి, షాదిముబార‌క్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయనన్ని సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ద‌ని తెలిపారు. ఇవాళ కేసీఆర్ పేదింటి యువ‌తుల‌కు మేన‌మామ‌లా మారార‌ని కొనియాడారు. పేదింటి అమ్మాయిల‌కు పెండ్లి కోసం రూ. 1,00,116ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఇస్తుంద‌ని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News