Monday, April 29, 2024

రాష్ట్రపతి చేతుల మీదుగా భారతరత్న అవార్డు అందుకున్న పివి కుమారుడు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారతర్న అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు తరుపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డును అందుకున్నారు. మరణానంతరం పివికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, పివి నరసింహరావు కటుంబంతోపాటు కర్పూరీ ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్ చౌదరి కుటుంబ సభ్యులు కూడా భారతరత్న అవార్డులను అందుకున్నారు.

కాగా, ఆదివారం ఎల్ కే అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందజేయనున్నారు రాష్ట్రపతి, ప్రధాని మోదీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News