Sunday, July 20, 2025

తూర్పుగోదావరిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడిశిలేరు గ్రామ శివారులో ఆయిల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రాజమహేంద్రవరంలోని కవలగొయ్యికి చెందిన వారిగా గుర్తించారు. కారు రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎడిబి రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News