Tuesday, May 14, 2024

మెగా డిఎస్‌సితో పేదలకు విద్య

- Advertisement -
- Advertisement -

త్వరలో గ్రూప్-1 పరీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్: ఉరితాళ్ళతో వేలాడినా ప్రజలు మీపై సానుభూతి తెలుపరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు. గత పదేళ్ళలో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్షం చే సిందని ఆయనన్నారు. గురువారం ఎల్‌బి స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రా ల అందజేత కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి పా ల్గొని ప్రసంగించారు. బిఆర్‌ఎస్ పాలన లో తండా లు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6, 450 సిం గిల్ టీచర్ పాఠశాలలు మూతపడ్డాయ ని, పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్ర భుత్వం పాఠశాలలు మూసేసిందని ఆయ న ఆరోపించారు. . తమ ప్రభుత్వం పేదల కోసం పని చే స్తుంటే మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తి ట్టు తి ట్టకుండా తిడుతున్నారని, పభుత్వం ఏర్పడిన 70 రోజుల్లోనే 25వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని, ఇది మీ కళ్లకు కనిపించడం లేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

30లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నామని ఆయనన్నారు. ఎన్నికలకు ముందు మేము చెప్పినట్లుగా, మీరిచ్చిన తీర్పుతో వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయని ఆయనన్నారు. యూపిఎస్‌సి తరహాలో టిఎస్‌పిఎస్‌సిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించబోతున్నామని తెలిపారు. నువ్వు రాజీనామా చెయ్ నేను చేసి చూపిస్తా అని హరీష్ అంటున్నాడని హరీష్ రావును చూస్తుంటే మరో ఔరంగజేబులా కనిపిస్తున్నాడని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుదని ఆయన తెలిపారు. పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్ ఏం చేశాడని నిలదీశారు. మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయారని ఆయన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నుద్దేశించి అన్నారు. 3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. త్వరలో మెగా డిఎస్‌సి ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటాంమని ఆయన చెప్పారు.

గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకోస్తామని, 20ఎకరాల్లో ఒకే క్యాంపస్ లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. కొడంగల్ లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామన్నారు. ఈ మోడల్ ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని ముఖ్యమంత్రి సిఎస్ శాంతికుమారిని ఆదేశించారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గురుకుల ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. పివి నరసింహారావు స్ఫూర్తిగా గురుకులాలు ప్రారంభిస్తే దాని తర్వాత నవోదయ విద్యాలయాలు ప్రారంభమయ్యాయన్నారు. మీరంతా గురుకులాలకు వెళ్ళాలి, ఉన్నత విద్యావంతులను తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సిఎస్ శాంతి కుమారి, సక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం గురుకుల ఉపాద్యాయులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News