Sunday, July 27, 2025

దుందుభి వాగులో పడి వృద్ధుడు మృతి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ జిల్లా, రఘుపతిపేట మండలంలోని రఘుపతిపేట దుందుభి వాగులో పడి వృద్ధుడు మరణించాడు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ప్రవాహం కొనసాగుతున్న సందర్భంగా శనివారం ఉదయం దుందుభి వాగులో తెల్కపల్లి మండలం, గౌరరం గ్రామానికి చెందిన సొంట జంగయ్య (60) వాగులో నడుచుకుంటూ వెళ్తుండగా కాలు జారి కింద నీటిలో పడ్డాడు. స్థానికులు, పలువురు యువకులు గమనించి వెంటనే ఆయనను లేవగా అప్పటికే నీరు మింగి మృతి చెందాడని తహసీల్దార్ ఇబ్రహం తెలిపారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొని వెళ్లారు. అనంతరం దుందుభి వాగులో బ్రిడ్జి నిర్మాణానికి పిల్లర్ గుంతలు తీయడం, కొన్ని పిల్లర్‌లు వేయడం వల్ల నీటి ఒరవడిని హిటాచీ, జెసిబిలతో ఇసుక అడ్డంకులను తొలగించినట్లు తహసీల్దార్ తెలిపారు. ఆయన వెంట ఆర్‌ఐ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News