Monday, June 17, 2024

ఏనుగు దాడికి వృద్ధ ఓటరు మృతి

- Advertisement -
- Advertisement -

ఓటు వేసేందుకు వెళ్తున్న 71ఏళ్ల వృద్ధునిపై ఏనుగుదాడి చేసి తొక్కి చంపింది. ఝార్ఖండ్ లోని తూర్పు సింగ్భమ్ జిల్లా గొబర్బనీ గ్రామ పెద్ద సురేంద్రనాథ్ హన్స్‌ద (71) దొలబెడ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు శనివారం ఉదయం అటవీ ప్రాంతంలో వెళ్తుండగా ఏనుగు దాడి చేసింది. ఈ సమాచారం గ్రామస్థులకు, పోలీస్‌లకు తెలిసింది. దీంతో పోలీస్‌లు, అటవీ శాఖ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. సురేంద్రనాథ్ మృతదేహాన్ని ఘటశిల సర్దార్ ఆస్పత్రికి పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియల కోసం అటవీశాఖ ఆ కుటుంబానికి రూ. 25 వేలు అందజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News