Saturday, May 4, 2024

సచివాలయంలోకి జర్నలిస్టులకు అనుమతి: జర్నలిస్టుల అధ్యయన వేదిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: నూతన ప్రభుత్వం జర్నలిస్టులను సచివాలయంలోకి అనుమతించాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడగానే అధికారికంగా ఉత్తర్వులు వెలువడడం పట్ల జర్నలిస్టు అధ్యయన వేదిక నేతలు వేణుగోపాల్ రెడ్డి, సాధిక్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతంలో బీఆర్కే భవన్‌లో తాత్కాలిక సెక్రటేరియట్ కొనసాగినప్పుడు, ప్రభుత్వం కొత్త సచివాలయం ప్రారంభించిన కూడా ప్రవేశం లేదన్నారు. సచివాలయం బయటే ఒక హాల్‌లో మీడియా పాయింట్‌ను ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఈ వార్త చెప్పిందని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News