Monday, April 29, 2024

ఆధార్ అప్‌డేట్ గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువును మరో మూడు నెలలు పాటు పొడిగించింది. ప్రస్తుతం గడువు సెప్టెంబర్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆధార్ యూజర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి తో డిసెంబర్ 14 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News