Friday, April 19, 2024

పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాన్- ఆధార్ తో లింక్ చేయనివారికి శుభవార్త. గడువు తేదీ ఈ నెలాఖరుతో ముగియనుండగా, మరికొంత మంది లింక్ చేయకపోవడంతో మరోసారి గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని జూన్ 30, 2023 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పాన్-ఆధార్ లింక్ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని, రూ. 1000 రుసుమును కూడా తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ప్రధాని మోడీకి లేఖ రాసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. మార్చి 31, 2022కి ముందు ఆధార్-పాన్ లింకింగ్ ఉచితంగా ఉండేది. ఏప్రిల్ 1, 2022 నుండి రూ. 500 రుసుము విధించబడింది. ఆ తరువాత జూలై 1, 2022 నుండి రూ. 1,000కి పెంచబడింది. పాన్-ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డులు ఇనాక్టివ్ అవుతాయి. బ్యాంక్ ఖాతాలు తెరవలేరు. ఐటిఆర్ దాఖలు చేయలేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News