Saturday, April 27, 2024

కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి కుటుంబం ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Family committed suicide in Kanakadurgamma temple

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా బెజవాడలో శనివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణం చెందారు. బెజవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ, కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణానదిలో తండ్రీ, కొడుకు దూకి గల్లంతయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News