Monday, April 29, 2024

డిజిటల్ చెల్లింపుల్లో ఓటిపికి గుడ్ బై చెబుతారా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: డిజిటల్ చెల్లింపుల్లో వన్ టైమ్ పాస్ వర్డ్(ఓటిపి)కి కాలం చెల్లనున్నది. దాని స్థానంలో కొత్త టెక్నాలజీ తేవాలని భారత రిజర్వు బ్యాంకు యోచిస్తోంది. ఓటిపి స్థానంలో బయోమెట్రిక్ సెన్సార్లు, అధెంటికేషన్ యాప్ లను తేవాలని యోచిస్తోంది. ఈ విధానం ద్వారా సిమ్ స్వాపింగ్, హ్యాకర్ల మోసాలను నిరోధించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త టెక్నాలజీని తెస్తే డిజిటల్ చెల్లింపులు మరింత భద్రం కానున్నాయని భావిస్తున్నారు. యుపిఐ చెల్లింపుల్లో కూడా ఇలాంటి భద్రతా ప్రమాణాలను పాటించాలని ఆర్బీఐ యోచిస్తోంది. కాగా ఆర్బీఐ ఎలాంటి మార్పులు తేనుందో వేచి చూడాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News