Friday, April 19, 2024

మద్యం మత్తులో రెండేళ్ల కొడుకును చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

నేరేడ్​మెట్​: మద్యం మత్తులో రెండేళ్ల కొడుకును తండ్రి దారుణంగా చంపిన సంఘటన హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ జేజే నగర్ లో చోటుచేసుకుంది. బాలుడు ఏడుస్తున్నాడని తండ్రి తీవ్రంగా కొట్టాడు. సుధాకర్ కు దంపతులకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. జేజే నగర్ లోని ఓ ఆపార్ట్ మెంట్ లో అతను వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఏడుస్తున్నాడని బాలుడు (జీవన్) తండ్రి తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో పసిబిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తల్లి దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నేరేడ్ మెంట్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News