పతంగుల మాంజా చిక్కుకుని పావురం విలవిల
కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్: హుస్సెన్సాగర్ తీరంలో స్వేచ్ఛ గా విహరిస్తున్న ఓ పావురం పతంగుల మాంజాలో చిక్కుకుని విలవిలలాడింది. నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద స్ట్రీట్ లైట్ స్తంభంపై వేలాడుతున్న మాంజాకు అటువైపుగా వెళుతున్న పావురం చిక్కుకుంది. అయితే మాంజా నుంచి తప్పించుకునేందుకు ఆ పావురం ప్రయత్నించడం, అది మరింత బిగుసుకుకోవడంతో కిందికి వేలాడుతూ బాధతో విలవిలాడి పోతున్న దృశ్యం స్థానికుల కంట పడింది.
వారు పావురాన్ని కాపాడే ప్రయత్నం చేసినా ఎ త్తులో ఉండడంతో సాధ్యపడలేదు. అయితే అటుగా వెళ్లుతున్న ఆగ్నిమాపక వాహనాన్ని గమనించిన స్థానికులు వి షయాన్ని సిబ్బందికి వివరించడం, వారు వెంటనే స్పం దించి నిచ్చెన సాయంతో పైకి ఎక్కి పావురానికి చిక్కుకు న్న మాంజాను తొలగించి గాలిలోకి ఎగురవేశారు. దీం తో స్వేచ్ఛగా గాలిలో ఎగిరిపోతున్న పావురాన్ని చూసి స్థానికులు అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు.
Firefighter Save Life Pigeon At Tank Bund