Wednesday, May 1, 2024

అక్టోబర్ తొలివారంలో కాంగ్రెస్ తొలి జాబితా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. సర్వేల ఫలితాలు, నియోజకవర్గాల్లో నేతల పనితీరు, సామాజి క అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో రెండు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ భేటీ కావడంతో పాటు దా దాపు 80 మంది అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖ రారు చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సీల్డ్ కవర్ లో ఆ జాబితాను పంపినట్టుగా తెలిసింది. ఈ జాబితాను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రా హుల్ గాంధీ పరిశీలించిన తర్వాత ఆమోదం తెలుపనున్నారు.

అనంతరం అక్టోబర్‌లో కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. తొలి జాబితాలో సీనియర్ నేతల పేర్లు కూడా ఉండనున్నాయి. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భ ట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లతో పాటు పలువురు సీనియర్ నేతల పే ర్లు ఉన్నట్టుగా తెలిసింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువమంది సీటు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఎవరికి సీటు ఇవ్వాలో కాంగ్రెస్ తేల్చుకోలేకపోతుంది. అలాంటి స్థానాలపై ఆచితూచి వ్య వహారించాలని అధిష్టానం నిర్ణయించింది.

మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ నిర్వహించి ఇలాంటి స్థా నాలపై చర్చించి రెండో జాబితాను తయారుచేయాలని నిర్ణయించింది. ఈ నెల 29వ తేదీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు స్క్రీనింగ్ కమిటీ పంపిన తొలి జాబితాను పరిశీలించనున్నా రు. అనంతరం తొలి జాబితాను విడుదల చేయనున్నారు. అక్టోబర్ తొలివారంలో తొలి జాబితా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలతో సైతం చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని వారికి టిపిసిసి ముఖ్యనేతలు సర్దిచెబుతున్నట్టుగా సమాచారం.

కాంగ్రెస్ సీనియర్‌లకు గడ్డుకాలమే!
చాలా నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన సీనియర్ అభ్యర్థులు ఓడిపోతారని పార్టీ చేపట్టిన సర్వేలో తేలినట్టుగా తెలిసింది. కానీ సీనియర్లు మాత్రం తా మే రంగంలోకి దిగుతామని పట్టుబట్టడం, మరోవైపు అక్కడ రిపోర్టులు తమకు అనుకూలంగా వ చ్చాయని తమకే ఆ సీట్లను కేటాయించాలని ఆశావహులు డిమాండ్ చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి టికెట్ విషయమై సంకటంగా మారింది. కొన్ని స్థా నాల్లో గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇవ్వాలని దాని కో సం సీనియర్లను పక్కన పెట్టక తప్పని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కొం తమంది సీనియర్లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా దరఖా స్తు చేసుకోకపోయినా వారి పేర్లను కూడా కొన్ని చోట్ల అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News