Thursday, June 26, 2025

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ముంచెత్తిన వరద

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్‌లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రం లోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెర్మినల్ ఏరియాలతోపాటు రన్‌వేపై కూడా వరద నీరు వచ్చి చేరింది.

ఎయిర్‌పోర్టు లోంచి వరద నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత 28 ఏళ్లలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టును వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News