- Advertisement -
పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తూన్ఖ్వా ప్రాంతంలో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు సైనికులు చంపబడ్డారని అధికార వర్గాలు గురువారం తెలిపాయి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని షావల్ చెక్పోస్ట్ వద్ద భద్రతా బలగాలపై ఉగ్రవాదులు బుధవారం కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించారు. వారిలో ఓ లెఫ్టినెంట్ కూడా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా ముసఖేల్ జిల్లాలో వేరే ఘటనలో నలుగురు ఉగ్రవాదులు కూడా చంపివేయబడ్డారని ఆ వర్గాలు తెలిపాయి. ఇక బన్నీ జిల్లాలో జరిగి మరో ఉగ్రవాద దాడి ఘటనలో ఇద్దరు పోలీసులు సహా ముగ్గురు హతమయ్యారు.
- Advertisement -