రాజస్థాన్లోని భరత్పుర్లో పైపులైన్ తవ్వకాల పనిలో ఉండగా మట్టి పెల్లలు విరిగిపడి నలుగురు కార్మికులు మరణించారు, ముగ్గురికి గాయాలయ్యాయి అని పోలీసులు ఆదివారం తెలిపారు. జంగీ కా నగ్లా గ్రామం సమీపంలో పైప్లైన్ వేస్తున్నప్పుడు కొందరు కూలీలు పది అడుగుల లోతు గుంత తవ్వారు. అయితే అప్పుడు మట్టి పూడుకు పోయి కార్మికులు మట్టి కింద ఇరుక్కుపోయారు. వారి అరుపులకు పక్కనే ఉన్న ఇతర కార్మికులు, ప్రాజెక్ట్ సిబ్బంది వెంటనే వారి రక్షించే పనిలో దిగారు. మట్టి బాగా పూడుకుపోవడంతో వారిని బయటకి తీసే పని చాలా కష్టంగా మారింది.
రాజస్థాన్లోని భరత్పుర్లో పైపులైన్ తవ్వకాల పనిలో ఉండగా మట్టి పెల్లలు విరిగిపడి నలుగురు కార్మికులు మరణించారు, ముగ్గురికి గాయాలయ్యాయి చివరికి గుంతలో పడిపోయిన ఏడుగురిని బయటికి తీశారు. అయితే వారిలో నలుగురు.. అనుకూల్(22), విమలా దేవి(45), వినోద్ దేవి(55), యోగేశ్ కుమారి(25) చనిపోయారు. మిగతావారిలో ఒకరికి ప్రాథమిక చికిత్స అందించారు. మరి ఇద్దరిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. మట్టిక పూడిక ఘటన అప్పుడు ఆ ప్రదేశంలో 12 మంది కార్మికులు పనిచేశారు. వారిలో కొందరు వెంటనే బయటికి వచ్చేశారు. కానీ మిగతా ఏడు మంది గుంతలో పూడుకుపోయారు. ఇదిలావుండగా రెస్కూ ఆపరేషన్ ముగిసిందని పోలీసులు తెలిపారు.