Monday, May 13, 2024

రేపటి నుంచే మహిళలకు ఉచిత బస్సు

- Advertisement -
- Advertisement -

సోనియా గాంధీ జన్మదినోత్సవం నుంచి రెండు గ్యారెంటీల అమలుకు నిర్ణయం

రూ.10లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి రేపట్నుంచే అమల్లోకి..

మిగిలిన నాలుగు గ్యారెంటీలపై త్వరలోనే నిర్ణయం

24గంటల కరెంటు మా గ్యారెంటీ

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం

ఉచిత గృహ విద్యుత్‌పై త్వరలో నిర్ణయం

ఐదేళ్లలో అన్ని హామీలు అమలు

పంట నష్టంపై అధికారులను నివేదిక అడిగాం

తొలి మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడించిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరిన కొద్ది గంటల వ్యవధిలోనే డా.బిఆర్.అంబేద్కర్ స చివాలయంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులు, పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థ్ధిక పరిస్థ్దితిని సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రివర్గం మరో కీలకమైన అంశంగా వి ద్యుత్ రంగం పరిస్థితులపైన హాట్‌హాట్‌గా చర్చలు జరిపారని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షత న గురువారం సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమా ర్క, మంత్రులు, సిఎస్ శాంతకుమారి ఇతర శాఖల అధికారులు హాజరైయ్యారు. ఆరు గ్యారెంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ముందుగా సిఎంగా సచివాలయంలో బాధ్యతలు రేవంత్‌రెడ్డి స్వీకరించారు. సిఎంగా సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. లోపల రేవంత్‌రెడ్డికి వేదపండితులు స్వాగతం పలికారు. తరువాత కేబినెట్ సమావేశం నిర్వహించి ఉచిత విద్యుత్, ఆరు గ్యారెంటీలపై మం త్రివర్గం చర్చించింది.

అనంతరం మీడియాతో మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈనెల 9న సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ముందుగా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బ స్సు ప్రయాణం సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచి పేదలకు వైద్య సేవలు అందించనున్నట్లు స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో ప్రజలు కోరుకునే మార్పు చూపిస్తామని, శుక్రవారం రెండు గ్యారెంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చించనట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులుకు ఆదేశించినట్లు చెప్పారు. 2014 నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రభుత్వ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా వ్యవసాయం రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని, గృహాలకు 200 యూ నిట్ల ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. రైతులకు పెట్టుబడి సాయంపై కూడా చర్చించినట్లు, ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లతామని వెల్లడించారు. మంత్రులకు శాఖల కేటాయింపులపై సిఎం, హైకమాండ్ నిర్ణయం తీ సుకుంటుందని, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల విషయంపై కూడా చర్చించాని, అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు పరిశీలిస్తారన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
9న నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన ఉం టుందని, ముందుగా ప్రోటెం స్పీకర్ ఎన్నికల తరువాత సభ్యులతో ప్రమాణం స్వీకారం గవర్నర్ తమిళిసై సభను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు చెప్పారు.
వేడివేడిగా సాగిన తొలి క్యాబినేట్ సమావేశం
సచివాలయంలో జరిగిన మంత్రివర్గం సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. ఉచిత విద్యుత్‌పై సుదీర్ఘంగా చర్చి సాగినట్లు, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శాఖలో ఉన్న ప్రస్తుత పరిస్ధితులను గోప్యంగా ఉంచడంపై మండిపడిట్లు తెలిసింది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్రలు చేయవద్దని చురుకుల వేశారని, రేపటిలోగా పూర్తి వివరాలను అందజేయాలని సూచించారు. నేడు విద్యుత్ శాఖ సమీక్ష ఉంటుందని, విద్యుత్‌శాఖలో ఇప్పటివరకు 85వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సిఎంకు వివరించారు. సిఎండి ప్రభాకర్‌రావు రాజీనామాను అమోదించవద్దని ఆదేశించినట్లు, విద్యుత్‌శాఖ సమీక్షకు ఆయనను రప్పించాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News