Friday, April 26, 2024

ఆపద సమయంలో పనిచేశాం.. ఆదుకోండి

- Advertisement -
- Advertisement -

బండి సంజయ్‌కు గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొర

హైదరాబాద్ : కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని గాంధీ ఆసుపత్రి 4వ తరగతి ఔట్ సోర్సింగ్ సిబ్బంది బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్‌ను కలిసి మొర పెట్టుకున్నారు. గురువారం బిజెపి కార్యాలయానికి వచ్చిన పలువురు సిబ్బంది బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు. కోవిడ్ సమయంలో ఏ ఒక్కరూ గాంధీ ఆసుపత్రిలో సేవలందించేందుకు సిద్ధంగా లేని సమయంలో తాము ముందుకు వచ్చి ప్రాణాలకు తెగించి ఉద్యోగాల్లో చేరి సేవలందించామని పేర్కొన్నారు.

అయినప్పటికీ తమ సేవలు అవసరం లేదని చెబుతూ గత నెలాఖరు నుంచి తమను ఉద్యోగాల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 244 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News