Saturday, July 27, 2024

నకిలీ ఫింగర్ ప్రింట్స్‌తో నగదు డ్రా చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఆరుగురు నిందితుల అరెస్టు
మీసేవ, రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో డాటా సేకరణ
రూ.10లక్షలు దోచుకున్న నిందితులు
వివరాలు వెల్లడించిన జాయింట్ సిపి గజారావు భూపాల్

మనతెలంగాణ, సిటిబ్యూరోః నకిలీ ఫింగర్ ప్రింట్లతో నగదు డ్రా చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాయింట్ సిపి గజారావు భూపాల్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులు సుమారుగా రూ. 10 లక్షలకు పైగా నగదును డ్రా చేశారు. నిందితుల వద్ద నుంచి ఫింగర్ ప్రింట్ మిషన్, 8 సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు ల్యాప్‌ట్యాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అసాధారణ్ అలియాస్ రూపేష్, ఉదయ్ కిరణ్, ఎండి ఇయాజ్, నరేందర్, శివకృష్ణ, శ్రీను కలిసి నకిలీ ఫింగర్ ప్రింట్ల ద్వారా నగదును డ్రా చేస్తున్నారు. నిందితులు మీ సేవ సెంటర్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలల్లో డేటా తీసుకుని మోసం చేస్తున్నారు. నిందితులు తీసుకున్న డేటాలో ఫింగర్ ప్రింట్ తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. ఆధార్ ఎనేబుల్ సిస్టమ్‌లో ఈ ముఠా వెండర్‌గా లాగినై ఆధార్, సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఈ ఘరానా మోసానికి పాల్పడుతున్నారు. డేటా తీసుకున్న తర్వాత నకిలీ ఫింగర్ ప్రింటర్స్ సృష్టించి ఈ ముఠా నగదును డ్రా చేస్తున్నారు.

ఇలా ఈ ముఠా 200 నుంచి 300 లావాదేవీలు జరిపారు. నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నాలుగు రోజుల్లోనే 10 లక్షల రూపాయలను డ్రా చేశారు. అసాధారణ, రూపేష్ ఇద్దరు కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో డేటాను తీసుకెళ్లారు. మార్చంట్ ఐడీ ద్వారా ఈ ముఠా సభ్యులు లాగినై, రబ్బర్ స్టాంప్, ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి వాటి ద్వారా డబ్బులు డ్రా చేశారు. శ్రీను అనే వ్యక్తికి మార్చంట్ ఐడీ ఇప్పించి ఈ నిందితులు మోసానికి పాల్పడుతున్నారు. శ్రీనుకి జాబ్ ఇప్పిస్తామని చెప్పి, బ్యాంక్ అధికారులతో వీడియో కాల్ చేయించారు. దీంతో శ్రీనుకి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి అవ్వగానే మార్చంట్ ఐడీ ఇచ్చారు. శ్రీనుతో పాటు మరికొంత మందికి కూడా ఇలా మార్చంట్ ఐడీలు ఇప్పించి, ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News