Tuesday, June 17, 2025

ఒంటరిగా వెళ్తున్న మహిళను లాక్కెళ్లి… పట్టపగలు గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Gang rape on women in Rajastan

జైపూర్: ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గిరిజన వివాహిత బాఘ్‌పూర్ శివారులో నడుచుకుంటు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. వెంటనే ఆమె తేరుకొని అక్కడ నుంచి 500 మీటర్లు పరుగెత్తి భాఘ్‌పూరా చౌక్‌కు చేరుకుంది. స్థానికుల సహాయంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News