Tuesday, May 14, 2024

కరోనా @ 3.37 లక్షల కేసులు

- Advertisement -
- Advertisement -

3.37 Lakh corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్ర(48 వేలు), కర్నాటక (48 వేలు), కేరళ(41వేల) రాష్ట్రాలలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 3,37,704 మందికి కరోనా వైరస్ సోకగా 488 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 3.89 కోట్లకు చేరుకోగా 4,88,884 మంది చనిపోయారు. కరోనా నుంచి 3.61 కోట్ల మంది కోలుకోగా 21 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పది వేలు దాటాయి. ఒమిక్రాన్ వ్యాప్తి చెందడంతోనే ఈ కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 161 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News