Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 5379 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

5379 Corona positive cases in India

 

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5379 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా 27 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఒక్క కేరళలో రాష్ట్రంలోనే 11 మంది చనిపోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.44 కోట్లకు చేరుకోగా 5.28 లక్షల మంది మరణించారు.  గత 24 గంటల్లో 7094 మంది బాధితులు డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 4.38 కోట్లకు పైగా మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 56,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18.8 లక్షల మందికి  కరోనా వ్యాక్సిన్ ఇవ్వగా,    మొత్తం డోసుల సంఖ్య 213 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News