Sunday, April 28, 2024

భర్త హఠాన్మరణం… భార్య భవనం పైనుంచి దూకి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: భర్త మృతిని తట్టుకోలేక నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలోని ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….అంజలి, అభిషేక్ అహ్లూవాలియా అనే దంపతులు మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులు వైశాలిలో ఓ అపార్ట్‌మెంట్ తీసుకొని ఉంటున్నారు. సోమవారం నవదంపతులు ఢిల్లీలోని జూపార్క్‌కు వెళ్లారు. అభిషేక్ ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే గురుతేజ్ బహదూర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సప్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. భర్త మృతదేహాన్ని తట్టుకోలేక అంజలి ఏడో అంతస్తు పైనుంచి కింద దూకింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. నవదంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News