- Advertisement -
కుత్బుల్లాపూర్: జీడిమెట్లలో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటించారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఎఇఇ అధికారి దౌర్జన్యం చేశారు. కమిషనర్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుండగా జర్నలిస్టులతో అధికారులు దురుసుగా ప్రవర్తించారు. కవరేజ్ చేస్తున్న విలేకరుల ఫోన్లను ఇరిగేషన్ అధికారులు విశ్రాంత ఎఇ రామారావు, ఎఇఇ అధికారి లాక్కుని విసిరేశారు. రామ్ రెడ్డి నగర్ నుంచి సుచిత్ర జాతీయ రహదారి వరకు రోడ్డు, ఫాక్ సాగర్ చెరువు పక్క నుంచి వెళ్ళే 100 ఫీట్ల రోడ్డును కమిషనర్ పరిశీలించారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో గల స్టీల్ బ్రిడ్జీని కమిషనర్ పరిశీలించారు.
- Advertisement -