Friday, April 26, 2024

రికార్డు స్థాయిలో జిహెచ్ఎంసి ఆస్తిపన్ను వసూళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రికార్డు స్థాయిలో జిహెచ్ఎంసి ఆస్తిపన్ను వసూళ్లు అయినట్టు అధికారులు వెల్లడించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో రూ.1681.72 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. జిహెచ్ఎంసి ఆస్తిపన్ను వసూళ్లలో రూ.2వేల కోట్ల లక్ష్యంగా పెట్టుకుంది. అత్యధికంగా ఖైరతాబాద్ జోన్ లో రూ.435.57 కోట్లు వసూలు కాగా, అత్యల్పంగా రూ.122.86 కోట్లు చార్మినార్ జోన్ లో వసూలైంది. శేరిలింగంపల్లి జోన్ లో రూ.348.60 కోట్లు, ఎల్ బినగర్ జోన్ లో రూ.259.06 కోట్లు, కూకట్ పల్లి జోన్ లో రూ.282.18 కోట్లు, సికింద్రాబాద్ జోన్ లో రూ.233.44 కోట్లు వసూలు అయిందని జిహెచ్ఎంపి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News