Monday, May 6, 2024

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడ/దామరచెర్ల: తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోతులూరి శ్రీనివాస్‌గౌడ్ (38) యదావిధిగా కల్లు గీసేందుకు సోమవారం ఉదయం 5 గంటలకు తాటి చెట్టు ఎక్కుతుండగా కాలుజారి కిందపడిపోవడంతో గమనించిన స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ మృతితో గాంధీనగర్‌లో విషాదం నెలకొంది. మృతుడు శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News