Sunday, April 28, 2024

90% వడ్డీ మాఫీ

- Advertisement -
- Advertisement -

Good news for property tax arrears from municipal department

అమల్లోకి ఓటీఎస్ పథకం…. 90 శాతం వడ్డీ మాఫీ…
రూ.1999.24 కోట్ల బకాయిల వసూలుకు పురపాలక శాఖ కసరత్తు
అక్టోబర్ 31వ తేదీతో ముగియనున్న ఓటీఎస్ పథకం

హైదరాబాద్: ఆస్తిపన్ను బకాయిదారులకు పురపాలకశాఖ శుభవార్త చెప్పింది. 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ ఓటీఎస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. జీహెచ్‌ఎంసి సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తూ ఆ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి జిఓ ఆర్‌టి నెంబర్ 485లో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగియనుందని పురపాలక శాఖ ఆ జీఓలో తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2021, -22 వరకు ఉన్న బకాయిలను 10 శాతం వడ్డీతో ఈ పథకం కింద చెల్లించవచ్చని శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ బకాయిలను పూర్తి వడ్డీతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జులై 16 మధ్య చెల్లించి ఉంటే వారికీ ఓటిఎస్ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు చెల్లించిన వడ్డీలో 90 శాతాన్ని వెనక్కు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని భవిష్యత్ ఆస్తిపన్ను డిమాండ్‌లో సర్దుబాటు చేయనున్నారు. 2020 ఆగస్టులో కూడా ప్రభుత్వం ఇదే మాదిరి ఓటీఎస్ పథకాన్ని తీసుకురావడంతో చాలామంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021, 22 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా రూ.1999.24 కోట్లు ప్రభుత్వానికి బకాయిలు రావాల్సి ఉండగా ప్రభుత్వం ఈ విధానాన్ని మరోసారి అమల్లోకి తీసుకొచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News