Sunday, April 28, 2024

సెర్ఫ్ ఉద్యోగులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వర్తింప చేస్తూ జీఓ ఎంఎస్ నంబర్ 11ను జారీ చేసింది. 23 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 3,978 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పే స్కేల్ అమలులోకి రానున్నది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి, తమ డిమాండ్ సాకారం అయ్యే విధంగా కృషి చేసిన మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కవితకు సెర్ఫ్ ఉద్యోగుల కృతజ్ఞతలు తెలిపారు. సిఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. 23 ఏళ్లుగా మిగతా రాష్ట్ర ఉద్యోగుల తరహాలో పెరగని నిర్ణీత నేతనాలతో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఉగాది కానుకగా తీపి కబురు చెప్పారు.

గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు, అసెంబ్లీలో మార్చి 15న చేసిన ప్రకటన మేరకు సెర్ఫ్ ఉద్యోగులకు సవరించిన వేతనాలతో కూడిన కొత్త పే స్కేల్ వర్తింపజేస్తూ జీవో నెంబర్ 11ను శనివారం విడుదల చేశారు. దీంతో సెర్ప్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.58 కోట్ల అదనపు భారం పడనుంది. నిజామాబాద్ జిల్లా భీమగల్ లో రాష్ట్ర జెఎసి తరఫున ముఖ్యమంత్రి చిత్ర పటానికి సెర్ఫ్ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్‌రెడ్డి, నరసయ్య, సుదర్శన్, సుభాష్, జానయ్య, వెంకట్, సురేఖలు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. ఇందుకు సహకరించిన మంత్రులు హరీశ్‌రావు, కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కవితకు జెఎసి తరఫున ధన్యవాదాలు తెలిపారు.
* పెరిగిన సెర్ఫ్ ఉద్యోగుల వేతనాలు ఇలా..
సెర్ఫ్ ఉద్యోగుల కనిష్ట పే స్కేల్ రూ.19 వేల నుంచి రూ. 58,850లు కాగా, గరిష్ట పేస్కేల్ రూ. 51,320, రూ. 1,27,310లుగా నిర్ణయించింది
‘ మండల్ సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ రూ. 19,000 నుంచి – 58,850
‘ మండల్ సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్స్( మండల్ రిప్రజెంటెటివ్ పర్సన్స్) – రూ. 19,000 నుంచి – రూ. 58,850
‘ మండల్ బుక్ కీపర్స్ – రూ. 22,240 నుంచి- రూ. 67,300
‘ కమ్యూనిటీ కో ఆర్డినేటర్స్ – రూ. 24,280నుంచి – రూ. 72,850
‘ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్స్ – రూ. 32,810 – నుంచి రూ. 96,890
‘ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్స్ – రూ. 42,300 నుంచి – 1,15,270
‘ ప్రాజెక్టు మేనేజర్స్ – రూ. 51,230- నుంచి రూ. 1,27,310
‘ డ్రైవర్స్ – రూ. 22,900 – నుంచి రూ. 69,150
‘ ఆఫీస్ సబార్డినేట్స్ – రూ. 19,000 -నుంచి రూ. 58,850
‘ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రాజెక్టు సెక్రటరీస్ – రూ. 24,280నుంచి – రూ. 72,850

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News