Monday, April 29, 2024

గోరటి వెంకన్నకు సిజెఐ అభినందనలు

- Advertisement -
- Advertisement -

Gorati Venkanna Meet CJI NV Ramana

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణను మర్యాదపూర్వకంగా కవి, రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కలిశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా గోరటి వెంకన్నకు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సిజెఐ సన్మానించారు. వెంకన్నను అభినందించిన జస్టిస్ ఎన్‌వి రమణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిజెఐ ఎన్‌వి రమణకు వల్లంకి తాళం కవిత సంపుటి పుస్తకాన్ని గోరటి వెంకన్న అందజేశారు. రమణ అభ్యర్థన మేరకు అడవి తల్లిపై పాట పాడి గోరటి వెంకన్న వినిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News