Friday, May 16, 2025

మర్డర్ కేసు…దుబాయ్ లో భారతీయుడిని ఉరి తీసి…

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నాలుగు సంవత్సరాల క్రితం రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని గుజరాత్ చెందిన వ్యక్తి హత్య చేయడంతో అతడిని దుబాయ్‌లో ఉరితీశారు. అతడి మృతదేహాన్ని దుబాయ్ నుంచి గుజరాత్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుజరాత్ రాష్ట్రం కపడ్వంజి గ్రామానికి చెందిన ముస్తాకిమ్ అనే వ్యక్తి వంట పని చేస్తూ దుబాయ్‌లో నివసిస్తున్నాడు. గత ఏడు సంవత్సరాల నుంచి కువైట్‌లో కులీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అంతకు ముందు పది సంవత్సరాలు దుబాయ్‌లోని బహ్రెయిన్ ప్రాంతంలో వంట పని చేస్తూ జీవనం సాగించేవాడు.

రాజస్థాన్‌కు చెందిన రెహానా ఖాన్, ముస్తాఫా ఖాన్ అనే దంపతులు జీవనోపాధి కోసం దుబాయ్‌కు తీసుకెళ్లాడు. ముగ్గురు కలిసి ఒకే దగ్గర ఉంటూ జీవనం సాగించేవారు. 2021లో ముస్తాకిమ్‌కు రెహానా ఖాన్‌తో గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో రెహానా ఖాన్‌ను ముస్తాకిమ్ చంపేశాడు. దీంతో ముస్తాకిమ్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. దుబాయ్ కోర్టు ముస్తాకిమ్ ఉరి శిక్ష విధించింది.  కోర్టు ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 28న ముస్తాకిమ్ ను ఉరి తీశారు. భారత ఎంబసీ అధికారులు మస్తాకిమ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దుబాయ్ నుంచి మృతదేహాన్ని అహ్మదాబాద్‌కు తరలించారు. అహ్మదాబాద్‌లో ముస్లిం సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News