Tuesday, April 30, 2024

మద్యం దుకాణాలలో గౌడ కులస్తులకు రిజర్వేషన్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: గౌడ కులస్తులు సౌకర్యవంతంగా శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు 6 కోట్ల రూపాయలతో ఎసి కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించడం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో కలిసి 6 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన శ్రీ మహారేణుక ఎల్లమ్మ తల్లి గౌడ ఎసి కన్వీన్షన్ సెంటర్ ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రసంగించారు.ఈ కన్వెన్షన్ సెంటర్లో శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు గౌడ కులస్తులందరికీ ఉచితంగా అందిస్తామన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 12 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ లాగా అన్ని జిల్లా కేంద్రాలలో నీరా కేఫ్ లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ వారి దాడులతో, చెట్టు పన్నుతో ఇబ్బందులకు గురవడమే కాకుండా, గీత కార్మిక సొసైటీలను రద్దు చేసి ఇబ్బందులకు గురి చేయగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే సిఎం కెసిఆర్ గీత పారిశ్రామిక సంఘాలను పునరుద్ధరించడంతో పాటు చెట్టు పన్నును రద్దు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. లంచం కోసం ఆనాటి పాలకులు, అధికారులు కల్లు డిపోలను మూసి వేశారని, నేడు ప్రభుత్వం మద్యం దుకాణాలలో గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించిందని ప్రశంసించారు.

గీత కార్మిక సహకార సొసైటీలు ఉంటే గౌడ జాతి అభివృద్ధి చెందుతుందని, గౌడ జాతి గౌరవం పెంచేలా సర్దార్ పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని హరీష్ రావు కొనియాడారు. మూడు కోట్ల రూపాయలతో ట్యాంక్ బండి పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని ముఖ్యమంత్రి నెలకొల్పారని, సిద్దిపేట పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ పునరుద్ధరణ కోసం సహకారం అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ శాశనమండలి చైర్మన్ స్వామి గౌడ్, గీత పరిశ్రమిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్,పల్లె లక్ష్మణ్ గౌడ్, సిద్దిపేట జెడ్పిటిసి తదితరులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News