Friday, April 19, 2024

రాంగ్ సైడ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు. ఈ నెల 28 నుంచి రాంగ్ సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. రాంగ్ సైడ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు. రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తే రూ. 1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సిగ్నల్ పడిన తర్వాత స్టాప్ లైన్ దాటి జీబ్రా క్రాసింగ్ లేదా అంతకంటే ముందు వాహనాలు ఆపుతారో వారిపై మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 177 ప్రకారం రూ.100 రూపాయల జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News