Monday, April 29, 2024

హోంమంత్రి నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలి: టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

హోంమంత్రి మహమూద్‌అలీ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలి
టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్


మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌లు పేర్కొన్నారు. టిఎన్జీఓ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డా.యస్.యమ్.హుస్సేనీ (ముజీబ్) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ 70వ జన్మదినం పురస్కరించుకొని హోంమంత్రి నివాసంలో సాయంత్రం కేక్‌ను కట్ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మామిళ్ల రాజేందర్, ప్రతాప్‌లు మాట్లాడుతూ హోంమంత్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉద్యోగులకు ఉండాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నామని వారు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఎంఎన్‌జె క్యాన్సర్ ఆస్పత్రిలో సుమారు వెయ్యిమంది రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డా.ముజీబ్ మాట్లాడుతూ మహమూద్ అలీ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మలిదశలో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పదవులు చేపట్టారన్నారు. భగవంతుడు వారిని ఆయురారోగ్యాలతో ఉంచాలని, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రార్థించినట్టు ఆయన తెలిపారు.

జన్మదిన వేడుకలు నిర్వహించిన టిఎన్జీఓలకు హోంమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షుడు కె.ఆర్.రాజ్ కుమార్, ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఎం.ఏ.ముజీబ్, ఖాలీద్ అహ్మద్, వైధిక్ శాస్త్ర, శంకర్, ఎం.డి.వహీద్, కాన్సర్ ఆసుపత్రి సభ్యులు సుధాకర్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News