- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. ఇక, ఆదివారం తిరుమల వెంకన్నను 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,372 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.49 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -