Monday, April 29, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 28 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకోవాడినికి భక్తులకు 16 గంటల సమయం పడుతుంది. స్వామివారికి దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించకుంటున్నారు.

కాగా, బుధవారం శ్రీవారి 72,263 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 25,518 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News